డాక్టర్ నూకసాని బాలాజీకి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు
BSBNEWS -KANDUKUR
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా శనివారం బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నూకసాని బాలాజీకి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు విజయవాడ లోని వారి ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, కందుకూరు పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, అల్లం వెంకటేశ్వర్లు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.