అనైతిక కార్యకలాపాలకు తెలుగుదేశం పుట్టినిల్లు - కాకాణి

bsbnews
0

అనైతిక కార్యకలాపాలకు తెలుగుదేశం పుట్టినిల్లు - కాకాణి

BSBNEWS - నెల్లూరు

నెల్లూరు నగర నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా.కాకాణి గోవర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ముందుగా మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫిబ్రవరి 3వ తేది జరగనున్న నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నికపై కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు, సలహాలు చేరారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ నెల్లూరు నగరం కార్పొరేషన్ లో 54కి 54 స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీఫారం పై గెలిచిన కార్పొరేటర్లు నేడు ద్రోహం చేయడం, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లేనన్నారు. మంత్రి నారాయణ రాజ్యాంగబద్ధ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మా కార్పొరేటర్లను మభ్యపెట్టి, టిడిపిలో చేర్చుకుంటున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంలో చంద్రబాబుకు నీతి, నిజాయితీ ఉండదన్నారు. చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కార్పొరేటర్లకు రేపు డిప్యూటీ మేయర్ గా  బిఫారం ఇవ్వవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిలబడేందుకు ఒక్కరు కూడా టిడిపి బీఫామ్ పై గెలిచిన కార్పొరేటర్ లేరన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల మనోభావాలను గౌరవిస్తుంది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు ప్రధాన్యత ఇచ్చారన్నారు. డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడంతో పాటు, నెల్లూరు నగర శాసనసభ్యునిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో మిగిలిపోయాయన్నారు. పార్టీ ఫిరాయింపులు చేసిన కార్పొరేటర్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఒక పార్టీలో గెలిచాం, ఒక వాణి వినిపించాం, పార్టీ మారి నేడు అధికారం కోసం భిన్నమైన అభిప్రాయాలు వినిపించడం ఆవేదనను కలుగజేస్తుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం పై గెలిచిన కార్పొరేటర్లు మనసు మార్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకుంటారా, లేక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకుంటారా అనేది వాళ్లే నిర్ణయించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పట్ల అనైతికంగా ప్రవర్తిస్తుందన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సూచనలతో ప్రజల అభిమతం మేరకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు అందరం కట్టుబడి ఉంటామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బీఫామ్ తో గెలిచాం, జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తాం, జగన్మోహన్ రెడ్డి వెంటే నిలుస్తామంటున్న కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)