శనగ పంట పొలాలను పరిశీలన

bsbnews
0

శనగ పంట పొలాలను పరిశీలన

BSBNEWS - వలేటివారిపాలెం 

మండలంలోని శాఖవరం గ్రామంలో మండల వ్యవసాయాధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు పి.అనసూయ రైతులతో కలిసి శనగ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం శనగ పంట పూత, కాయ దశలో ఉన్నది అని, శనగలో మొదలు కుళ్ళు, వేరు కుళ్ళు తెగులు ఉన్నదని, దీని నివారణకు తెగుళ్ళు సోకిన పొలాల్లో పంట మార్పిడి (జొన్న, సజ్జ, కొర్ర)చేసుకోవాలని తెలిపారు. ఉదృతి ఎక్కువ కాకుండా ఎకరాకు 200గ్రాములు కార్బన్ డైజిమ్, 600 గ్రాముల మాన్కోజెబ్ లేదా ట్రైకో డేర్మా విరీడి 5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అని సూచించారు. శాఖవరం గ్రామంలో శనగ పంటలో గ్యాప్ పొలంబడి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ వారి సలహాలు సూచనలు తో పంటను సాగు చేస్తారు అని, కోత అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా శనగ పంటను మార్కెట్ ధర కంటే 20 నుంచి 30 శాతం అధిక ధరతో కొనుగోలు చేస్తారన్నారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి రైతుకి ఒక ప్రత్యేక విశిష్ట సంఖ్య(యూనిక్ నెంబర్)ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని సులభతరం చేసి పారదర్శకంగా సేవలను అందించడం కోసం చేయబడుతున్న బృహ హత్కరమైన రైతు ప్రత్యేక విశిష్ట సంఖ్య (యూనిక్ నెంబర్) నమోదు కార్యక్రమం అని తెలియజేసారు. కావున రైతులు మీ సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు ఆధారకార్డు, పట్టాదారు పాసు పుస్తకాలు, మొబైల్ నెంబర్ తీసుకొని ప్రత్యేక పోర్టల్ లో అన్ని వివరాలు నమోదు చేసుకొన్న తర్వాత ఒక ప్రత్యేక విశిష్ట సంఖ్య పొందవచ్చునని, తద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే వివిధ రకాల పథకాలు, రాయితీలు, పి ఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యంత్ర పరికరాలు, పంటల బీమా, పెట్టుబడి రాయితీలు తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.  రైతులు అందరూ తప్పనిసరిగా రబీ సీజన్లో వేసిన ప్రతి పంటను పంట నమోదు చేసుకొని, కె వై సి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సాంకేతిక వ్యవసాయ అధికారి పి .దుర్గా, గ్రామ వ్యవసాయ సహాయకులు  వై.ప్రభూ  గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)